AP: లోక్సభ తొలి దళిత స్పీకర్, టీడీపీ సీనియర్ నేత జీఎంసీ బాలయోగి వర్థంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ‘ఒక సామాన్య దళిత కుటుంబంలో పుట్టి లోకసభ స్పీకర్ స్థాయికి ఎదిగిన అసాధారణ ప్రతిభాశాలి. కోనసీమ ముద్దుబిడ్డ, తెలుగువెలుగు జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుందాం. ఆ అభ్యుదయనేత స్మృతికి నివాళులు అర్పిద్దాం’ అని ట్వీట్ చేశారు.