WNP: వీపనగండ్ల మండల కేంద్రంలో సర్వే నెంబర్ 721లో ప్రభుత్వ భూమిలో చిరు వ్యాపారస్తులకు ఎమ్మార్వో ప్రభాకర్ రావు నోటీసులు జారీ చేశారు. బతుకు తెరువు కొరకు వేసుకున్న చిరు వ్యాపారస్తులు తమ సొంత స్థలంలా భావించడం సరైనది కాదని, ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మార్వో తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవడానికి అందరు సహకరించాలన్నారు.