WGL: పట్టణ కేంద్రంలోని భద్రకాళి అమ్మవారి ఆలయం నేడు చంద్రగ్రహణం సందర్భంగా ద్వార బంధనం చేశారు. గ్రహణం ప్రారంభానికి ముందు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు పూర్తి చేసి ఆలయ ద్వారాలను మూసివేశారు. నిత్య పూజలను తాత్కాలికంగా నిలిపివేశారు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయ శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తామని అధికారులు తెలిపారు.