JGL: జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. చివరి రోజైన ఆదివారంపెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. కల్యాణకట్టలో దీక్షాపరులు మాలవిరమణ చేసి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తమ స్వస్థలాలకు తిరుగుపయనమయ్యారు.