NRML: దిలావర్పూర్ మండలంలో మంగళవారం జై బాపు, జైభీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ కార్యక్రమం అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తోందని, రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని కోరారు.