KMR: సంపన్నులతో సమానంగా పేదలకు సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం గాంధారి మండలం పెద్ద గుజ్జల్ తండాలో బానోత్ సోఫీ, వినోద్ ఇంట్లో కలెక్టర్తో పాటు పలువురు అధికారులు భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లబ్ధిదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.