ELR: ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన రెండు డిక్కీ దొంగతనాల కేసుల్లో నిందితులను గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ప్రతాప్ కిషోర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. షేక్ గాల్సిద్, బొంతు రాజశేఖర్ రెడ్డి అనే ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ.5 లక్షల నగదు ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారన్నారు.