SKLM: జిల్లాలో ఈ నెల 5న వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సౌజన్యంతో అంబేద్కర్ విశ్వవిద్యాలయం NSS యూనిట్, మేరా యువ భారత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. నిన్న జిల్లా జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతులు ఆవిష్కరించారు.