TG: జిల్లాల కలెక్టర్లతో ఇవాళ సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల హామీల అమలు, సంక్షేమ పథకాల పంపిణీ, క్షేత్రస్థాయిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయడం ఈ ప్రణాళిక యొక్క ప్రధాన ఉద్దేశంగా పెట్టుకున్నారు.