VZM: గరివిడి శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం విద్యార్థులు సోమవారం నిరవధిక దీక్ష చేపట్టారు. స్టైఫండ్ వెంటనే ప్రభుత్వం మంజూరు చేయాలని దీక్షకు దిగారు. మెడికల్ విద్యార్థులకు ఇచ్చే సౌకర్యాలు పశువైద్య విద్యార్థులకు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు దీక్షలు కొనసాగిస్తామన్నారు.