బాపట్ల: నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా తనను కలిసేందుకు, శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే అభిమానులు, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పూల బొకేలు, గజమాలలు, పూల దండలు, దుశ్శాలువలు తీసుకురావద్దని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పిలుపునిచ్చారు. బొకేలు, పూలమాలలు తెచ్చే వారు అదే ఖర్చుతో పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పుస్తకాలు, పెన్నులు అందించాలని కోరారు.