GDWL: మల్దకల్ మండల కేంద్రంలో వెలసిన తిమ్మప్ప స్వామిని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సతీమణి బండ్ల జ్యోతి శనివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, స్వామికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం అందించారు.