NLR: మర్రిపాడు మండలం నందవరం ఆదర్శ పాఠశాల నందు 2026-27 విద్యా సంవత్సరంలో 6వ తరగతి చేరబోవు విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సోమవారం ప్రిన్సిపల్ పి.లక్ష్మీ నారాయణ తెలియజేశారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో చదివిన విద్యార్థులు మార్చి 31 లోపు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.