GDWL: గట్టు మండలం ఇందువాసి గ్రామంలో ఎంవీఎఫ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించాలని బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ ఫ్లాష్ కార్డులు పట్టుకొని ర్యాలీ గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ పాఠశాలల ఛైర్మన్లు, గ్రామ సీఆర్పీఎఫ్ సభ్యులు , గ్రామ పెద్దలు ఎంవీఎఫ్ స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు పాల్గొని నినాదాలు చేశారు.