BDK: ఇల్లందు ఎమ్మెల్యే కనకయ్య గురువారం మంత్రి సీతక్కను పాల్వంచలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఇల్లందు నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా గ్రామాల అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేయాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు.