కృష్ణా: మచిలీపట్నం సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులకు సీఐ సుశీల బాల్యవివాహాల నిర్మూలన,ఫోక్స్ చట్టంపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాల్య వివాహాల వల్ల కలిగే శారీరిక మానసిక,సామాజిక సమస్యల గురించి వివరించారు. ఫోక్స్ చట్టం కింద బాలికల రక్షణకు ఉన్న నిబంధనలు ఫిర్యాదు చేసే విధానం గురించి సూచనలు అందించారు.