W.G: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు యూటీఎఫ్ జిల్లా అధ్యక్షడు ప్రధాన కార్యదర్శులు విజయరామరాజు, పీ. క్రాంతి కుమార్ తెలిపారు. సోమవారం వీరవాసరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో ‘ఊరి బడిని బతికించుకుందాం’ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామానుజరావు, తదితరులు పాల్గొన్నారు.