MNCL: జనవరి 5, 6, 7 తేదీలలో హైదరాబాద్లో జరగనున్న అఖిల భారత దళిత హక్కుల ఉద్యమం జాతీయ రెండవ మహాసభలను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పిలుపునిచ్చారు. గురువారం రామకృష్ణాపూర్లో ఆయన విరాళాల సేకరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో దళితుల అభ్యున్నతిపై మహాసభల్లో చర్చించనున్నట్లు తెలిపారు.