SRD: అంబేద్కర్పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సంగారెడ్డి కొత్త బస్టాండ్ ముందు దళిత బీసీ సంఘాల ఆధ్వర్యంలో గురువారం రాస్తారోకో నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దళిత వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు.