KMR: లింగంపేట మండలం ముంబాజిపేట తండాలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా భవనానికి గడప పూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జగదాంబ సేవలాల్ స్వాములు ప్రత్యేక పూజలు చేసి, గ్రామాభివృద్ధిని కాంక్షిస్తూ ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో బీ. సురేశ్ నాయక్, జి.ప్రకాశ్ నాయక్, ఆలయ కమిటీ సభ్యులు, పాల్గొన్నారు.