SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఇంటర్ పరీక్షలు 5వ రోజు మొత్తం 253 మంది విద్యార్థులకు హాల్ టికెట్లు కేటాయించగా, 244 మంది హాజరయ్యారు. 9 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సజావుగా నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.