KMM: మధిర పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు జగన్మోహన్ రావు, శ్రీనివాసరావు చంద్రశేఖర్ ప్రారంభించారు. అన్ని దానాలలో కల్లా అన్నదానం మిన్న అని చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.