HNK: పెరుగుతున్న అవసరాలు అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీ ద్వారా ఆన్లైన్లోనే వినియోగదారుల సమస్యలకు సత్సర పరిష్కారం లభిస్తుందని వరంగల్ అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం వరంగల్ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన వినియోగదారుల సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.