ఖమ్మం: ఆశా వర్కర్ల హక్కుల సాధనకై జరిగే జీపు జాతను జయప్రదం చేయాలని సీఐటీయూ వన్ టౌన్ కన్వీనర్ షేక్ నాగులుమీరా అన్నారు. మంగళవారం సీఐటీయు ఖమ్మం వన్టౌన్ కమిటీ ఆధ్వర్యంలో జీపు జాత కార్యక్రమానికి సంబంధించిన కర పత్రాలను ఆవిష్కరించారు. ఈనెల 26న జీపు జాత ఖమ్మం నగరానికి వస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల వేతనాలను తక్షణమే పెంచాలని డిమాండ్ చేశారు.