నల్గొండ: విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని చేస్తున్న సమ్మె ఈరోజుతో 15 రోజులకు చేరింది. ఒక్కో రోజు ఒక్కో విధంగా వినూత్న రీతులలో ప్రభుత్వానికి తమ బాధను తెలియజేస్తున్నారు. దయచేసి తొందరగా తమ ఉద్యోగాల రెగ్యులరైజేషన్ ప్రక్రియను ముందుకు కొనసాగించి పేస్కేల్ ప్రకటించాలని వారు కోరుతున్నారు.