NLG: రెవెన్యూ సమస్యలను జాప్యం చేయకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం ఆమె దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీవో, కార్యాలయ సిబ్బందితో వివిధ అంశాలపై సమీక్షించారు. ప్రజలకు సంబంధించిన సమస్యలపై వెంటనే స్పందించి జాప్యం లేకుండా పరిష్కరించాలని, ప్రజావాణి ఫిర్యాదులు, భూసేకరణకు సంబంధించిన వాటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.