GNTR: పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామంలో రూ.36.90 లక్షలతో నిర్మించిన సీసీ డ్రైన్లను ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ ప్రారంభించారు. MGNRGS నుంచి రూ. 13.45 లక్షలు, 15వ ఆర్థిక సంఘం నుంచి రూ. 23.45 లక్షలతో పనులు పూర్తిచేసినట్లు తెలిపారు. గ్రామ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.