NRPT: రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేడ్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నారాయణపేటలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు శీను మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్పై వ్యాఖ్యలకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.