పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు ఎస్ఎఫ్ఐ నేతలు వినతిపత్రం అందజేశారు. అనంతరం కాసేపు విద్యారంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజకుమార్ తదితరులు ఉన్నారు.