AP: అమరావతిపై వైసీపీ విమర్శలు అర్ధరహితమని మంత్రి నారాయణ అన్నారు. నిరాధార ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. అలాగే, ఉద్యోగులకు నిర్మిస్తున్న 4,026 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. గత 3 నెలల్లో రాజధానిలో నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయని చెప్పారు. వచ్చే మూడేళ్లలో పరిపాలన భవనాలు అందుబాటులోకి తెస్తామన్నారు.