SDPT: చంద్రగ్రహణం సందర్భంగా బెజ్జంకిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని మంగళవారం తాత్కాలికంగా మూసివేయనున్నట్లు ప్రధాన అర్చకులు శేషం మధుసూదనాచార్యులు తెలిపారు. గ్రహణం దృష్ట్యా ఉదయం 6 గంటలకే ఆలయ ద్వారాలు మూసివేస్తామని పేర్కొన్నారు. తిరిగి ఎల్లుండి (4వ తేదీ) ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.