AP: నెల్లూరులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆటోనగర్లోని ప్లాస్టిక్ గోదాములో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలతో పాటు వేదాయపాలెం మొత్తం పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. గోదాముకు తాళం వేసి ఉండటంతో లోపలకు వెళ్లేందుకు వీలుకాని పరిస్థితి నెలకొంది.