SRD: భక్తి మార్గం ద్వారానే సంపూర్ణ మానసిక ప్రశాంతత లభిస్తుందని నీలం మధు అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం ఉత్తులూరులో నూతన ఆలయంలో గంగమ్మ తల్లి విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. గ్రామాల్లో ఆధ్యాత్మికత పెరిగితే సోదరభావం వృద్ధి చెందుతుందని, గ్రామాలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.