AKP: దేవరాపల్లి మండలం సమ్మెద గ్రామంలో జీడి రైతులు ఆందోళన చేపట్టారు. జీడి పిక్కలకు కిలోకు రూ. 200 మద్దతు ధర ప్రకటించి, రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం 80 కేజీల బస్తాకు రూ.8,000 మాత్రమే ఇస్తుండటంతో తీవ్ర నష్టం వాటిల్లుతోందని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.టి.దొర తెలిపారు. జీడికి ప్రత్యేక నిధి కేటాయించాలని కోరారు.