JGL: ఇబ్రహీంపట్నం మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో 285 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. ఈదురు గాలులు భారీ వర్షంతో, మండలంలోని పలు గ్రామాల్లో పంటలు దెబ్బతినగా దెబ్బతిన్న పంటలను వ్యవసాయ అధికారులు పరిశీలించారు. 335 మంది రైతులకు చెందిన 285 ఎకరాలలో నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేసి జిల్లా అధికారులకు నివేదిక అందజేశారు.