శ్రీకాకుళం నగరంలో ఆదివారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 214కు చేరినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. 116 మంది కోలుకుని ఇంటికి చేరుకోగా ప్రస్తుతం 94 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. డయేరియా ప్రభావిత ప్రాంతాలలో ఇప్పటి వరకు 135 కేసులు నమోదైనట్లు, 89 మంది పూర్తిగా కోలుకున్నారని పేర్కొన్నారు.