AKP: నక్కపల్లి మండలం ఉపమాక వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి పండిత సదస్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కళ్యాణ వేదికపై ఉభయదేవేరులను అదిష్టింప చేసి ప్రత్యేక పూజలు చేసి హారతులు ఇచ్చారు. ప్రధాన అర్చకులు ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో పలువురు వేతపండితులను ఘనంగా సత్కరించారు.