సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి పరిధిలోని విద్యానగర్లో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. కాలనీలో నివాసం ఉండే బంగారం వ్యాపారి విక్రమ్ ఇంటికి తాళం వేసి శనివారం ఊరికి వెళ్లారు. ఆదివారం ఇంటికి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉంది. బీరువాలో ఉన్న 15 తులాల బంగారం చోరీ అయినట్లు గుర్తించారు. ఘటనా స్థలాన్ని సంగారెడ్డి రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి పరిశీలించారు.