ATP: కూడేరు మండలంలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది. ఆదివారం నాటికి జలాశయంలో 3.75 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. హంద్రీనీవా నుంచి 300 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, ధర్మవరం కాలువ, తాగునీటి ప్రాజెక్టులకు కలిపి 685 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతోంది.