T20 ప్రపంచకప్ 2026 క్వార్టర్ ఫైనల్లో వెస్టిండీస్పై భారత్ ఘనవిజయం సాధించి సెమీస్కు చేరింది. 196 పరుగుల లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్ 50 బంతుల్లో 97* పరుగులతో వీరవిహారం చేశాడు. ఒంటిచేత్తో జట్టును గెలిపించిన సంజూపై మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రశంసలు కురిపించారు. ఇది అద్భుతమైన మాస్టర్ఫుల్ ఇన్నింగ్స్ అని, సంజూ ప్రతిభకు ఇది నిదర్శనమని ఆయన కొనియాడారు.