GNTR: టీడీపీ ప్రభుత్వం ‘రెడ్ బుక్’ రాజ్యాంగంతో ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తోందని పొన్నూరు వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ విమర్శించారు. జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబును పరామర్శించేందుకు ఈ నెల 21న ‘చలో గుంటూరు’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శుక్రవారం తెలిపారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.