CTR: జిల్లాలోని పీసీఆర్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధులకు ఉపకరణాల నమోదు శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్ మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత ప్రభుత్వ సంస్థ ALIMCO ద్వారా ఈ నెల 17 నుంచి 24వ తేది వరకు జిల్లాలో ఈ గుర్తింపు శిబిరాలు జరుగుతాయని తెలిపారు.