BPT: సంతమాగులూరు మండలంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సాగునీటి సంఘం డీసీ అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులకు మంగళవారం ఎన్నిక నిర్వహించారు. ఎన్నికల్లో సంతమాగులూరు మండలం డీసీ అధ్యక్షుడిగా అడవి పాలెంకు చెందిన శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడిగా ఏల్చూరు గ్రామానికి చెందిన నాసరయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నీటి సంఘాల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.