GNTR: ఉండవల్లిలో మంగళవారం నిర్వహించిన మంత్రి లోకేష్ ప్రజాదర్బార్కు వినతులు వెల్లువెత్తాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భారీ ఎత్తున తరలివచ్చిన బాధిత ప్రజలకు మీకు అండగా ఉంటానంటూ లోకేష్ భరోసా కల్పిస్తున్నారు. మంత్రి లోకేష్ను కలుస్తున్న వారిలో భూ బాధితులే అధికంగా ఉంటుండటంతో రెవెన్యూ, పోలీసు అధికారులు సమస్యలకు పరిష్కారం చూపాలని ఆదేశించారు.