SKLM: ఆమదాలవలస గాజులకొల్లివలస RRకాలనీకి చెందిన D. పద్మ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎస్సై వెంకటేష్ తన సిబ్బందితో సోమవారం నుంచి నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో భవాని మాలలో ఉన్న నిందితుడు S. సురేష్ ను సన్నిధానం వద్ద మంగళవారం అదుపులో తీసుకున్నట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.