TPT: శ్రీకాళహస్తిలో కూల్చివేతలపై మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు లేకుండా ఎలా కూలుస్తారని ఆయన అధికారులను నిలదీశారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. తమను మాజీ ఎమ్మెల్యే అసభ్య పదజాలంతో తిట్టారంటూ టౌన్ ప్లానింగ్ అధికారిణి శారద వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మధుసూదన్ రెడ్డిపై కేసు నమోదైంది.