KDP: వేముల మండలంలో మీడియా విలేకరులపై జరిగిన దాడిని ఖండిస్తూ గాలివీడులో డిప్యూటీ తాహశీల్దారుకు శనివారం విలేకరులు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నీటి సంఘాల ఎన్నికలను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడి చేయడం అమానుషం అన్నారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.