VZM: బొబ్బిలి పట్టణంలోని స్థానిక గ్రోత్ సెంటర్ సమీపంలో సీఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. పరిమితికి మించిన లోడ్ విశాఖ నుంచి బొబ్బిలి వైపు వెళ్తున్న రెండు సిలికా మాంగనీస్ లారీలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఒక్కో లారీకి రూ. 30 వేలు చొప్పున జరిమానా విధించినట్లు వెల్లడించారు.