సత్యసాయి: పెనుకొండ పట్టణంలో బాబయ్య స్వామి ఉరుసు సందర్భంగా బైక్ రైడింగ్ యువకులకు జిల్లా ఎస్పీ కౌన్సెలింగ్ నిర్వహించారు. శనివారం సాయంత్రం హైవేలో రైడింగ్ చేస్తున్న 30 మంది యువకులను పోలీసులు స్టేషన్కు తరలించారు. రైడింగ్ చేయడం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా జిల్లా ఎస్పీ రత్న యువకులకు కౌన్సెలింగ్ చేపట్టారు.