ATP: ఆరు నెలల పాటు కలుగులో దాక్కున్న ఎలుకలన్నీ ఇప్పుడు బయటకొచ్చి కీస్ కీస్ మంటున్నాయంటూ ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేపట్టిన రైతు పోరుబాటపై ఆమె తీవ్రంగా స్పందించారు. అనంతపురంలోని క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ.. అసలు వైసీపీ నాయకులకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా.. అని నిలదీశారు.